
| ముడి సరుకురుల ధరలు పెరుగుతుండటంతో ఇప్పట్లో ఉక్కు ధరలు తగ్గవని టాటా స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ ఎమ్ నెరూర్కర్ తెలిపారు. కాగా.. దక్షిణాఫ్రికాలో ఉన్న టాటా స్టీల్స్ యూనిట్ను విక్రయిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో లేదని ఆయన అన్నారు. |
| సినిమాని హైప్ చేసుకునేందుకు నోటికొచ్చిన లెక్కలు చెబుతుంటారు నిర్మాతలు. ముఖ్యంగా ప్రింట్లు, థియేటర్ల విషయంలో తమకు తోచిన నంబర్ చెప్పి అదే నిజమనుకునేలా పదేపదే జనం మీద రుద్దుతారు. వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నామని అయిదారొందల ప్రింట్లు పెడుతున్నామని కాకి లెక్కలు చెప్పేస్తారు. వెర్రి అభిమానులు అదంతా నిజమేనని నమ్మేస్తుంటారు. అయితే ప్యూచర్ చూసుకోకుండా ఇలా వేలాది |
| ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పూర్తిగా అవినీతిపరులుగా తేలింది. అలాగే, సగం మంది ప్రజలు సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్నట్టు కేంద్ర అవినీతి విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమీషనర్ (సీవీసీ)గా ఈ వారంలో పదవీ విరమణ చేసిన ప్రత్యూష్ సిన్హా దేశంలో లంచగొండితనం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలలో చాలా వరకు ప్రతిది డబ్బుతోనే చూస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్త . . . |
| ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మరోమారు మాటమార్చనున్నారు. ప్రత్యేక తెలంగాణ, సామాజిక న్యాయం అంశాల్లో ఆయన మాటకు కట్టుబడని విషయం తెల్సిందే. నిన్నమొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉంటానని, ప్రజాసేవకే ఈ జీవితం అంకితమని ప్రచారం చేస్తూ వచ్చిన చిరంజీవి బుధవారం మాటమార్చారు. |
| కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు నేపాల్ రాజకీయ పార్టీలు కృషి చేయాలని అమెరికా సూచించింది. ప్రధాని ఎంపిక కోసం ఇప్పటి వరకు ఆరు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పురాని విషయం తెల్సిందే. అయినప్పటికీ.. ఆ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తూ ఉండాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. |
| ప్రభుత్వరంగ సంస్థ ఎమ్ఎమ్టీసీ దిగుమతి చేసుకున్న 9,365 టన్నుల పప్పుధాన్యాలను స్థానిక మార్కెట్లో అమ్మకానికై ఈ నెల చివరి నాటికి బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగు సెప్టెంబర్ 14న ముగుస్తుంది. ఈ బిడ్డింగు ఫలితాలపై నిర్ణయం సెప్టెంబర్ 21న తీసుకోనున్నట్లు ప్రకటించింది. |
| బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని బుధవారం ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమేముంది? నేను ఇప్పటికే ఎమ్మెల్సీలో సభ్యుడు. తన పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉందని గుర్తు చేశారు. |
| ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆగస్టు నెల అమ్మకాలలో రెండింతల వృద్ధిని సాధించింది. ఆగస్టు నెలలో మొత్తం అమ్మకాలు 573 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా.. గతేడాది ఇదే సమయానికి సంస్థ కేవలం 270 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. |
| ఒకవైపు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర వాడివేడిగా సాగుతుండగా, ఇంకోవైపు నెల్లూరు జిల్లాలో అప్పుడే ఓదార్పు జ్వరం పట్టుకుంది. అక్కడ ఆనం వర్సెస్ మేకపాటి వర్గాలు వైఎస్ విగ్రహ ప్రతిష్టాపనపై ఒకరిపై ఒకరు... |
| రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా లేదా అని ప్రజలు అనుమానంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దీంతో రోశయ్యకు పూర్తిస్థాయిలో సహకారం అందటం లేదు. ఫలితంగా... |
| కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు మరో సమస్య లేవనెత్తారు. తమకంటూ ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావాలంటూ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇంకేమాత్రం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లో కొనసాగలేమని తేల్చి చెప్పనున్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత సమన్వయ కమిటీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఆర్సిసి)ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తూ సరికొత్త వాదనను . . . |
| దక్షిణాసియాలో శాంతి స్థాపన కోసం భారత్తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. దక్షిణాసియాలో తాము కీలక దేశమని, అందువల్ల ఈ ఉపఖండంలో శాంతిస్థాపన కోసం భారత్తో కలిసి ముందుకు సాగేందుకు కోరుకుంటున్నట్టు చెప్పారు. |
| ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన "అణు పరిహార బిల్లు"లోని కొన్ని కీలక ప్రాంతాలలో ఎటువంటి అంశాలను మార్పు చేయాలనే అంశంపై అమెరికా భారత్పై దృష్టి సారించింది. "ఈ అంశంపై భారత ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నాం, ఇటీవల పార్లమెంటు ఆమోందించిన అనంతరం ఈ బిల్లు చట్టం గురించి కొందరు భారత వ్యాపార వేత్తల సలహాలను పరిశీలిస్తున్నాం" అని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి పి.జె. క్రౌలీ తెలిపారు. |
| గత ఐదేళ్లుగా చౌక ధరలకే విమాన సేవలు అందిస్తున్న స్వదేశీ విమానయన సంస్థ స్పైస్జెట్ త్వరలో విదేశీ మార్కెట్లో అడుగు పెట్టనుంది. అక్టోబర్ 7 నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రాంరభించను్న్నట్లు స్పైస్జెట్ ప్రకటించింది. గడచిన ఐదేళ్లుగా వాటాదారులు మా మీ ఉంచిన నమ్మకం, వారి ప్రోత్సాహం కారణంగానే మేము ఈ విజయాన్ని సాధించగలిగాం అని సంస్థ డైరంక్టర్, సీఈఓ కిషోర్ గుప్తా తెలిపారు. |
| ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం ఏం చెప్పిందో తమకు తెలియదని చెప్పే నేతలకు తాను సెల్యూట్ చేస్తానని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. నిజంగా అధిష్టానం చెప్పే ప్రతి మాటను అంత గోప్యంగా ఉంచుతున్నందుకు వారికి సలాం చేయాల్సిందేనన్నారు. |
| హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో సంపాదించిన ఆస్తుల గురించి కాంగ్రెసు నేతలు ఇప్పుడు లెక్క చెబుతున్నారని కానీ తాము ఆనాడే 'రాజా ఆఫ్ కరప్షన్' పేరుతో పుస్తకం వేసి మరీ వెల్లడించామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. పులివెందులలో వైఎస్ తండ్రి రాజారెడ్డి ఫ్యాక్షనిజం మొదలుపెట్టి, రాయలసీమంతా |